మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం

మన Enadu: సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర ఈనెల 8 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు అధికారాలు అన్ని ఏర్పాట్లు చేశారు.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయాన్ని కాకతీయులు క్రీస్తుశకం.1311 లో నిర్మాణం చేసినట్లు ఇక్కడున్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాతన కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు లింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి. దేశంలోనే అతికొద్ది దర్శనీయ దైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొంత శివలింగం పెరుగుతూ ఉంటదని స్థానికులు చెపుతూ ఉంటారు. శివలింగం మీద ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసిన మళ్లీ జల ఊరుతూనే ఉంటుంది.

Mellacheruvu Shambhu Lingeswara Temple : మేళ్లచెరువు శివాలయంలో ఈ నెల 8నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. జాతరకు చుట్టుపక్క గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రానున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణంలో పాల్గొననున్నారు. మేళ్లచెరువు జాతరలో ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్లు పోటీల్లో నిలుస్తాయి. మేళ్లచెరువు జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి. విద్యుత్ దీపాల కాంతులతో ఏర్పాటు చేసిన ప్రబల వద్ద నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మేళ్లచెరువు శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *