ఉప్పల్​ బరిలో నిలిచి.. విజయం దిశగా పరమేశ్వరరెడ్డి

మన ఈనాడు:
గ్రేటర్​ హైదరాబాద్​లో ఉప్పల్​ నియోజకవర్గం ఈసారి హట్​ టాఫిక్ గా మారింది. అధికారపార్టీ మాత్రం సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డిని కాదని మరో బలమైన నాయకుడు బండారి లక్ష్మారెడ్డికి అభ్యర్థిగా ఖారారు చేసి భీపామ్​ సైతం ఇచ్చింది. కాంగ్రెస్​ పార్టీ నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మందుముల పరమేశ్వరెడ్డికే టిక్కెట్​ ఖారారు చేసింంది.

ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్​, భారస అభ్యర్థులను ప్రకటించింది. భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​ పేరు దాదాపు ఖాయం అయింది. కానీ తెరమీదకి మరో కొంతమంది బీసీ నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతలోనే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. హస్తం పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి స్థానిక నాయకలు మనస్సు గెలుచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రాజకీయపార్టీలకు అతీతంగా కాలనీసంఘాలు మందములకే అవకాశం ఇస్తామంటూ మద్దతు సైతం పలుకుతున్నారు.

స్థానికుడిగా ఉన్న గతంలో కార్పొరేటర్​ సేవలు అందించా..ఇప్పుడు నా సతీమణి రజిత కార్పొరేటర్​ కొనసాగుతుంది. హస్తం గుర్తుపై ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొందామని మందముల పరమేశ్వరరెడ్డి జనాన్ని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్​ అభ్యర్థికి వస్తున్న ఆదరణతో భారస, భాజపాలు కంగుతింటున్నాయి.

ఉప్పల్​ రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంది. నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి కాంగ్రెస్​ విజయం సాధించింది. తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో భాజపాను గెలిపించారు. తర్వాత బీఆర్​ఎస్​ అభ్యర్థికి పట్టం కట్టారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకే అవకాశం ఇవ్వబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారం కంటే చేరికలపై దృష్టి సారించింది. గ్రూపు రాజకీయాలతో భారస అభ్యర్థి జనంలోకి వెళ్లే పరిస్థితిపై ఆపార్టీ నేతలు సందిగ్దం వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలతో జనంలోకి విసృంతగా కాంగ్రెస్​ అభ్యర్థి ప్రజల్లోకి పోతున్నారు. భారస అభ్యర్థి మాత్రం తన ట్రస్టు ద్వారా జనానికి చేసిన సేవలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లడం సొంతపార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *