టికెట్ టెన్షన్..నామినేషన్ ఘట్టం ముగిసింది..ఇక ప్రచారం హోరెత్తించే సమయం ఆసన్నమైంది. ఉప్పల్ రాజకీయం నేటితో షురూ కానుంది. సెగలు పుట్టించే ప్రచారానికి గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పల్ వేదిక కానుంది. ఇప్పటికే అధికారపార్టీ ఇద్దరు మంత్రులు కేటీఆర్, హరీష్రావు వచ్చి దిశానిర్దేశం చేశారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలుపెట్టిందే మేముంటూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రచారం చేస్తున్నారు. పది డివిజన్లలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు కార్పొరేట్ స్థానాలు గెలిచిన కమలం పార్టీ. మరో నాలుగింట రెండోస్థానంలో ఉన్నారు. తాజాగా కేసీఆర్ వ్యతిరేఖ ఓటు బ్యాంకు తనకే పడుబోతుందని ధీమాగా ఉన్నారు.
అధికారపార్టీ అభ్యర్థి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కంటే తన ట్రస్టు అందించిన సేవలనే నమ్ముకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేరుతో కంటే బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు పేరుతో ప్రజలకు చేసిన సేవ పేరుతోనే జనంలో ప్రచారం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యర్థులంతా ఇప్పుడు గులాబీ గూటిలోనే ఉన్నారు. వీరి బలం గులాబీకి మైలేజ్ తీసుకొస్తుందా..? లేదా ప్రతిపక్షాలకు బలంగా మారుతోందానే అనే సందేహాం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆరు గ్యారంటీలు, తులం బంగారం వంటి పథకాలతో హస్తం పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వశాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా భావిస్తున్నారు. కార్పొరేటర్గా ప్రజలకు చేసిన సేవ , మరోసారి అవకావం ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఉప్పల్ అభివృద్ధి చేసి తన సత్తా ఎంటో చూపిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాలనీల్లో యువత, నిరుద్యోగులు, మహిళలు హస్తం పార్టీ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది.