Breaking : వైజాగ్​లో MRO దారుణ హత్య

మన ఈనాడు: విశాఖపట్నం జిల్లాలో దారుణం ఘటన జరిగింది. కొమ్మాది మండల MRO రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు.

గుర్తు తెలియని మనుషులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే రమణయ్యను ఎవరు హత్య చేశారో, కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. అయితే ఇదంతా ల్యాండ్ మాఫియా వాళ్ళ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కక్షగట్టే ఈ పని చేశారని అంటున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీపీ రవిశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఎమ్మార్వో రమణయ్య పదేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు. డిప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్, కలెక్టరేట్లో ఏవో గా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పని చేసిన రమణయ్యకు ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది.

Related Posts

Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?

ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…

రేప్ చేస్తే లైఫ్‌టైమ్ జైల్లోనే.. ‘అపరాజిత బిల్లు’కు బంగాల్ అమోదం

ManaEnadu:పశ్చిమ బెంగాల్‌ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *