Breaking : వైజాగ్​లో MRO దారుణ హత్య

మన ఈనాడు: విశాఖపట్నం జిల్లాలో దారుణం ఘటన జరిగింది. కొమ్మాది మండల MRO రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు.

గుర్తు తెలియని మనుషులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే రమణయ్యను ఎవరు హత్య చేశారో, కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. అయితే ఇదంతా ల్యాండ్ మాఫియా వాళ్ళ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కక్షగట్టే ఈ పని చేశారని అంటున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీపీ రవిశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఎమ్మార్వో రమణయ్య పదేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు. డిప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్, కలెక్టరేట్లో ఏవో గా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పని చేసిన రమణయ్యకు ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది.

Share post:

లేటెస్ట్